ఆకాశమే నీ హద్దురా , జై భీమ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న సూర్య..ఇప్పుడు ఈటీ మూవీ తో మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పాండురాజ్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ తరుణంలో ఈటీ తెలుగు టీజర్ ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఒక్క నిమిషం ఏడు సెకండ్ల నిడివిగల ఈ టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు.
- Advertisement -
హీరోయిన్, విలన్ లను ఒక్కో ఫ్రేమ్ లో టీజర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సూర్య మాస్ అవతార్ ను ఎలివేట్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో సూర్య జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది. వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నారు. అలాగే సత్యరాజ్, రాజ్ కిరణ్, శరణ్య లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- Advertisement -