కరోనా సెకండ్ వేవ్ సెలబ్రిటీలని బెంబేలెత్తిస్తోంది. తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా తమ చుట్టూ వుండే వారు చిన్న తప్పు చేసినా దానికి స్టార్స్ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ స్టార్స్ తమ తప్పు లేకపోయినా తమ చుట్టూ వున్న వారి అజాగ్రత్త వల్ల కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల హీరో రామ్చరణ్ వ్యానిటీ వ్యాన్ డ్రైవర్ కోవిడ్ బారిన పడి మరణించడం తెలిసిందే.
దీంతో ముందు జాగ్రత్త చర్యగా రామ్చరణ్ ఫ్యామిలీ స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. ఇదే తరహాలో సూపర్స్టార్ మహేష్ వద్ద స్టైలిస్ట్గా వర్క్ చేస్తున్న వ్యక్తిగత స్టైలిస్ట్ కరోనా బారిన పడ్డారు. దీంతో మహేష్ ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మహేష్ ప్రకటించనప్పటికీ స్వీయ నిర్భంధంలో ఫ్యామిలీ అంతా వుండటంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
`మహేష్ అన్న మీరు జాగ్రత్తగా వుండండి` అంటూ సోషల్ మీడియా వేదికగా మహేష్కు విజ్ఞప్తి చేస్తున్నారు. #SataysafeMaheshAnna అనే హ్యాష్ ట్యాగ్తో ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీకి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.