Homeటాప్ స్టోరీస్నిజాలు మాత్ర‌మే రాయండీ: ర‌జ‌నీ

నిజాలు మాత్ర‌మే రాయండీ: ర‌జ‌నీ

నిజాలు మాత్ర‌మే రాయండీ: ర‌జ‌నీ
నిజాలు మాత్ర‌మే రాయండీ: ర‌జ‌నీ

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మీడియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మీడియాలో పారద‌ర్శ‌క‌త‌, నిజాయితీ లోపిస్తోందిన‌, అది స‌మాజానికి మంచిది కాద‌ని చెన్నైలో ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. చెన్నైలో జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ర‌జ‌నీ మీడియాపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రు ఏం చేసినా ఎండ‌గ‌ట్టే మీడియా త‌ట‌స్థంగా వుంటూ వార్త‌ల్ని ప్ర‌చురించ‌డం వ‌ల్ల స‌మాజానికి న‌ష్టం క‌లుగుతోంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

బాధ్య‌తాయుత‌మైన మీడియా రంటం త‌ట‌స్థంగా వుండ‌కుండా వాస్త‌వాల్ని వెలికితీసే ప్ర‌య‌త్నం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ మీడియా సంస్థ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌ర్న‌లిస్ట్ అంటే సీనియ‌ర్ పాత్రికేయులు, `తుగ్ల‌క్` ప‌త్రిక అధినేత చో రామ‌స్వామిలా వుండాల‌ని, నిజాల‌ని నిర్భ‌యంగా ప్ర‌పంచానికి చాటి చెప్పాల‌ని, అలా చేసిన‌ప్పుడే వ్య‌వ‌స్థ‌లో మార్పు, భ‌యం మొద‌ల‌వుతాయ‌ని వెల్ల‌డించారు.

- Advertisement -

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చో రామ‌స్వామి లాంటి పాత్రికేయులు కావాల‌ని, ఏది నీల్లో, ఊది పాలో జ‌ర్న‌లిస్టుల‌కు మాత్ర‌మే తెలుస‌ని, అది స‌మాజానికి కూడా తెలియ‌జేస్తే బాగుంటుంద‌ని, నిర్భ‌యంగా వార్త‌లు రాయండ‌ని, నిజాల‌ని మాత్ర‌మే చెప్పండ‌ని, స‌మాజానికి అబ‌ద్ధాల‌ని ప్రచురించొద్ద‌ని ఈ సంద‌ర్భంగా మీడియా సంస్థ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. దీనిపై కీల‌క మీడియా సంస్థ‌లు ఎలా స్పందిస్తాయో చూడాలి అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All