సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండింగ్ లో కింగ్ అన్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలు బ్రాండ్లను ఎండార్స్ చేస్తోన్న మహేష్ లిస్ట్ లోకి తాజాగా బిగ్ సి చేరింది. ఈ మొబైల్ అమ్మకాల కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించనున్నాడు మహేష్ బాబు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో మహేష్ తన రాబోయే సినిమాల గురించి కూడా స్పందించాడు.
“సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ దాదాపు 60 నుండి 70 శాతం పూర్తయింది. నన్ను చాలా కొత్తగా చూస్తారు. నా ఫ్యాన్స్ కు కామన్ ఆడియన్స్ కు చాలా బాగా అనిపిస్తుంది. జనవరిలో విడుదల చేస్తాం” అని సర్కారు వారి పాట చిత్రం గురించి చెప్పాడు. ఇక తన 28వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అనౌన్స్ అయిన విషయం తెల్సిందే.
ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఈ ఏడాదే షూటింగ్ ను మొదలుపెడతామని అన్నాడు. అలాగే రాజమౌళితో చేసే సినిమా గురించి కూడా స్పందించాడు మహేష్. రాజమౌళి వంటి దర్శకుడితో పనిచేయడం తన కల అని, అది మొత్తానికి నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు.