తెలుగు ప్రేక్షకుల్ని తనదైన మార్కు హాస్యంతో ఆకట్టుకున్నారు సునీల్. ఆయన సినిమాల్లోకి రాకముందు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూమ్మేట్. బ్యాచ్లర్ జీవితం అనుభవిస్తున్నసమయంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారని, ఆ తరువాతే సినిమాల్లోకి వచ్చారని చాలా కాలంగా ప్రచారంలో వుంది. అయితే ఈ ఇద్దరిలో ఒకరైన త్రివిక్రమ్ దర్శకుడు కాగా, సునీల్ హస్యానటుడయ్యారు. మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ఆ తరువాత హీరోగా మారి వరుస చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్తిస్ట్గా మారారు. త్రివిక్రమ్ రూపొందించిన `అరవింద సమేత` సినిమాతో సునీల్ మళ్లీ కొత్త బాట పట్టిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించారు. ఈ చిత్ర థ్యాంక్స్ మీట్లో స్నేహితులు సునీల్ సీక్రెట్ని బయటపెట్టారు త్రివిక్రమ్. సునీల్, తాను బ్యాచిలర్గా వున్న సమయంలో తనకి కమెడియన్ కావాలని వుండేది కాదని, విలన్గా గుర్తింపు పొందాలని వుండేదని అసలు విషయం బయటపెట్టేశారు.
హాస్యనటుడిగా మారితే ఇండస్ట్రీలో వున్నటాప్ కమెడియన్వి అవుతావని చెప్పానని, అలా చెప్పడం వల్లే సునీల్ కమెడియన్ అయ్యాడని, తను చెప్పిన మాటల్ని సునీల్ ఇప్పటికీ నమ్మడం లేదని, తనకి పద్మశ్రీ, పద్మభూషణ్లు వచ్చాక నమ్ముతాడేమోనని చెప్పుకొచ్చారు.