కమెడియన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆకట్టుకున్న సునీల్ త్వరలో షాకిచ్చే పాత్రలో కనిపించబోతున్నారు. వివరాల్లోకి వెళితే… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. 80వ దశకం నేపథ్యంలో ఈ సినిమా వుండబోతోంది.
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని `రంగస్థలం` ఫార్మాట్లో సుకుమార్ పక్కాగా ప్లాన్ చేశారు. ఇటీవల మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించారు. బన్నీ పాల్గొనగా పీటర్ హెయిన్స్ నేతృత్వంలో కీలక పోరాట ఘట్టాల్ని చిత్రీకరించారు. సడన్గా టీమ్ మెంబర్స్లో కొంత మందికి కరోనా లక్షణాలు కనిపించడంతో టీమ్ అంతా ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ వచ్చేసింది. తిరిగి కొంత విరామం తరువాత ఇక్కడ కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడం మొదలుపెట్టారు.
తమిళ హీరో ఆర్య విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడట. అయితే ఆయన పాత్ర రెగ్యులర్ పాత్రలలా కాకుండా షాడిస్ట్..,సైకో తరహాలో షాకింగ్గా వుంటుందని తెలుస్తోంది. సుకుమార్ సునీల్ పాత్రని సరికొత్తగా మలిచారట. దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియాల్సి వుంది. ఈ చిత్రానికి ముందు తమిళ హీరో విజయ్ సేతుపతిని విలన్గా తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో పలువురు నటుల్ని పరిశీలించిన చిత్ర బృందం చివరికి ఆర్యని విలన్ని ఫైనల్ చేసుకున్నట్టు తెలిసింది.