తొలి కలిసి వర్క్ చేసిన కాంబినేషన్ సూపర్ హిట్ని సొంతం చేసుకుని కొంత విరామం తరువాత మళ్లీ కలిస్తే ఆ కాంబినేషన్లో రానున్న సినిమాపై అంచనాలు నెలకొంటాయి. ఇప్పుడు అదే తరహా అంచనాలు సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కలయికలో రాబోతున్న సినిమాపై ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళితే… సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన చిత్రం `టైగర్`.
వీరిద్దరి తొలి కలయికలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు ఆరేళ్ల విరామం తరువాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇది సందీప్ కిషన్ నటిస్తున్న 28వ చిత్రం. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ రోజు సుందీప్ కిషన్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.
సందీప్ కిషన్ ప్రీ లుక్తో విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సూపర్ నేచురల్ ఫాంటసీగా ఈ మూవీని దర్శకుడు వీఐ ఆనంద్ తెరకెక్కించబోతున్నారు. ఫొటోలో సందీప్ కిషన్ ఒక వస్తువు లేదా వ్యక్తి కోసం వెతుకుతున్నప్పుడు ఒక రహస్య ప్రదేశంలో నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. SK28 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.