ఇటీవల సోమావారం ఓ ప్రత్యేకమైన ప్రకటన చేయబోతున్నానంటూ సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ని షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పోస్ట్ హీరో సందీప్ కిషన్ వివాహం చేసుకోబోతున్నట్టుగా వుంది. అదే విషయాన్ని చాలా మాధ్యమాల్లో ప్రస్తావిస్తూ వరుస కథనాలు వెలువడ్డాయి. అయితే వాటన్నింటికీ షకిచ్చిన సందీప్ కిషన్ తన సొంత బ్యానర్ వెంకటాద్రి టాకీస్ బ్యానర్పై కొత్త చిత్రాన్ని ప్రకటించాడు.
సినిమాల్లో నటిస్తూనే `వివాహ భోజనంబు` పేరుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ప్రారంభించి హోటల్ మేనేజ్మెంట్ రంగంలోకి ఎంటరైన సందీప్ కిషన్ తాజాగా అదే ఏరుతో ఓ వినోదాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించాడు. శినిష్తో కలిసి సందీప్ కిషన్ నిర్మించనున్న ఈ చిత్రానికి ఆనందీ ఆర్ట్స్ అదినేత జెమిని కిరణ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ నెం.3గా రూపొందనున్న ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ని సోమవారం రిలీజ్ చేశారు.
ఇందులో నటించే హీరో, హీరోయిన్.. మిగతా నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. నేను పెళ్లి చేసుకోబోతున్నానా అని అడుగుతూ నాకు కనీసం 100 కాల్స్ & 1000+ సందేశాలు వచ్చాయి …
ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు` అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.