క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ `పుష్ప` చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ పక్క ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూనే తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై అత్యుత్తమ చిత్రాల్ని అందిస్తున్నారు. ఇటీవల మైత్రీతో కలిసి `ఉప్పెన` చిత్రానికి సహ భాగస్వామిగా సుకుమార్ పని చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి వంద కోట్ల క్లబ్లో చేరింది. ఇదిలా వుంటే ఈ సంస్థలో కార్తికేయ హీరోగా ఓ వినూత్నమైన చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా కథ, మాటలు, స్క్రీన్ప్లే అందించబోతున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్కు దర్శకుడు ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే వెల్లడించనున్నారట.
కార్తికేయ ప్రస్తుతం జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మిస్తున్న `చావుకబురు చల్లగా` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్లో కార్తీకేయ పెర్ఫార్మెన్స్కి ఇంప్రెస్ అయిన సుకుమార్ హీరో కార్తికేయతో మూవీ చేయడానికి రెడీ అయ్యారట. సుకుమార్ కథ, మాటలు, స్క్రీన్ప్లే అందించనున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ఎవరిని పరిచయం చేయనున్నారో తెలియాలంటే మరో అప్డేట్ వరకు వేచయి చూడాల్సిందే.