
అగ్ర దర్శకుడు సుకుమార్ విభిన్నమైన కాన్సెప్ట్ లను ప్రమోట్ చేయడానికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ను స్థాపించిన విషయం తెల్సిందే. ఈ బ్యానర్ ద్వారా విభిన్నమైన చిత్రాలను ప్రమోట్ చేస్తున్నాడు. కుమారి 21ఎఫ్ చిత్రాన్ని అలానే నిర్మించాడు. ఉప్పెన చిత్రానికి కూడా సుకుమార్ రైటింగ్స్ కనెక్షన్ ఉంది.
అయితే ఈ బ్యానర్ వ్యవహారాలను ప్రసాద్ అనే వ్యక్తి చూసుకునేవాడు. ఈయన సుకుమార్ కు చాలా దగ్గరి స్నేహితుడు. కాకపోతే ప్రసాద్ కొద్ది రోజుల క్రితం మరణించారు. దీంతో సుకుమార్ రైటింగ్స్ ను చూసుకోవడానికి కొత్త బాస్ కావాలి. ఈ నేపథ్యంలో సుకుమార్ భార్య తబిత సుకుమార్ రైటింగ్స్ వ్యవహారాలు చూసుకోవడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యానర్ 18 పేజెస్ చిత్రానికి అసోసియేట్ అయింది. మరోవైపు సుకుమార్ దర్శకుడిగా పుష్ప చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.