ఇండస్ట్రీ హిట్ `అల వైకుంఠపురములో` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించనుంచిది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇందులో కోసం నెల్లూరు యాసపై పట్టుని సాధించే పని చేసింది కూడా.
శేషాచలం అడవుల నేపథ్యంలో గంథపు చెక్కల స్మగ్లింగ్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. లారీ డ్రైవర్గా బన్నీ పాత్ర చాలా కొత్తగా వుంటుందని ఇటివల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లని బట్టి అర్థమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్లు ఈ నెల మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే బన్నీ, సుక్కు మాత్రం `పుష్ప` రెగ్యులర్ షూటింగ్ని మాత్రం ఆగస్టు నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారట. అది కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్దతిలో షూటింగ్ చేసుకుంటూ వెళ్లాలని సుక్కు ప్లాన్ చేస్తున్నారట. పైగా పరిమిత సంక్షలో మాత్రంమే మెంబర్స్ని తీసుకుని షూటింగ్ చేయాలన్నది సుక్కు ప్లాన్గా తెలిసింది.