రంగస్థలం సినిమాతో సుకుమార్ తన సత్తాను చూపించాడు. మాస్ సినిమా క్రియేటివ్ డైరెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించాడు సుకుమార్. రంగస్థలం తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు సుకుమార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర మొదటి పార్ట్ షూటింగ్ ప్రస్తుతం సికింద్రాబాద్ లో జరుగుతోంది. ఆ తర్వాత శేషాచలం అడవుల్లో జరిగే 45 రోజుల షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది.
ఇక ఈ సినిమాలో సుకుమార్ పెద్ద రిస్క్ చేస్తున్నాడని సమాచారం. పుష్ప చిత్రంలో విలన్ గా సునీల్ నటిస్తున్నాడు. సునీల్ ను నెగటివ్ రోల్ లో తీసుకోవడానికి ప్రేక్షకులు ఇష్టపడతారా అన్నది ప్రశ్న. ఎందుకంటే సునీల్ విలన్ గా చేసిన డిస్కో రాజా ప్లాప్ అయింది. అంతే కాకుండా సునీల్ ను అలాంటి పాత్రల్లో చూడటానికి జనాలు ఇష్టపడట్లేదు.
మరి పుష్ప పార్ట్ 1 లో విలన్ గా సునీల్ ను తీసుకుని సుకుమార్ రిస్క్ చేస్తున్నాడా అనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.