Homeగాసిప్స్సుకుమార్.. ఈసారి ఏం చూపిస్తాడో

సుకుమార్.. ఈసారి ఏం చూపిస్తాడో

సుకుమార్.. ఈసారి ఏం చూపిస్తాడో
సుకుమార్.. ఈసారి ఏం చూపిస్తాడో

ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడికి ఒక్కో రకమైన శైలి, ఒక్కో విజన్ ఉంటాయి. వాటికి తగ్గట్లు సినిమాలు తీసుకుంటూ పోతుంటారు. ఈ ప్రాసెస్ లో విజయాలూ రావొచ్చు, పరాజయాలు కూడా పలకరించొచ్చు. అలాగే సుకుమార్ కు కూడా ఒక రకమైన విజన్ ఉంది. చాలా సింపుల్ గా సాగే కొన్ని సన్నివేశాలతోనే హీరోయిజాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్లగల దర్శకుడిగా సుకుమార్ కు పేరుంది. అలాగే అతని స్క్రీన్ ప్లే చాలా తెలివిగా సాగుతుందని పేరుంది. సినిమా ప్లాపైనా, హిట్టైనా ఈ ఫార్ములాను మాత్రం వదల్లేదు సుకుమార్. నిజానికి సుకుమార్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక విఫలమయ్యాడేమో కానీ ఎప్పుడూ బ్యాడ్ మూవీ తీసింది లేదు. తన లాస్ట్ సినిమా రంగస్థలంతో అయితే సుకుమార్ దర్శకుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఇంతలా తెలుగు నేటివిటీను చూపిస్తూ వచ్చిన సినిమా ఈమధ్య కాలంలో రాకపోవడంతో రంగస్థలానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

రంగస్థలం వంటి పెద్ద హిట్ ఇచ్చినా కానీ సుకుమార్ కు నెక్స్ట్ సినిమాను సెట్ చేసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ముందు మహేష్ తో సినిమా అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. వెంటనే అల్లు అర్జున్ తో సినిమా కన్ఫర్మ్ అయింది కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బన్నీ బిజీగా ఉండడంతో సుకుమార్ మరికొన్ని నెలలు వెయిట్ చేయకతప్పలేదు. మొత్తానికి అల్లు అర్జున్ 20వ చిత్రానికి ముహూర్తం ఇటీవలే జరిగింది. ఈ చిత్రానికి కూడా సుకుమార్ సూపర్బ్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నది దాదాపు కన్ఫర్మ్. కాకపోతే అల్లు అర్జున్ పాత్ర పైనే ఇంకా క్లారిటీ లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే బ్యాచ్ కు నాయకుడిగా అల్లు అర్జున్ కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. మరోవైపు అది కాదు, ఇందులో బన్నీ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపిస్తాడని అంటున్నారు.

- Advertisement -

ఏదేమైనా రంగస్థలం టైప్ లో ఈ చిత్రాన్ని కల్ట్ క్లాసిక్ ను చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అయితే రంగస్థలం షూటింగ్ కు ముందు రామ్ చరణ్ లుక్, పాత్ర తీరు తెలియజేసేలా ఒక పోస్టర్ ను వదిలాడు సుకుమార్. అల్లు అర్జున్ సినిమా లాంచ్ రోజున ఇలాంటి పోస్టర్ ను వదులుతాడేమోనని బన్నీ అభిమానులు ఆశపడ్డారు. కాకపోతే ఈసారి బన్నీ పాత్ర తీరుతెన్నులపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకూడదని సుకుమార్ ఫీలయ్యాడు. అందుకే ఎటువంటి పోస్టర్ ను వదల్లేదు. మైత్రి మూవీస్ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ లోనే పట్టాలెక్కుతుందని అంటున్నారు. టాప్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు బిజీగా ఉన్న కారణంగా ఈ చిత్రానికి సుకుమార్ తో కలిసి పనిచేయట్లేదు. అయితే దేవి శ్రీ ప్రసాద్ తో అనుబంధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే ఆర్య, ఆర్య 2 రేంజ్ లో పాటలు కావాలని అభిమానుల నుండి దేవి శ్రీ ప్రసాద్ కు వినతులు అందుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All