Homeన్యూస్పుష్ప బ్యాలెన్స్ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన సుకుమార్

పుష్ప బ్యాలెన్స్ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన సుకుమార్

పుష్ప బ్యాలెన్స్ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన సుకుమార్
పుష్ప బ్యాలెన్స్ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన సుకుమార్

దర్శకుడు సుకుమార్ కు రంగస్థలం వంటి భారీ హిట్ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది. మొత్తానికి పుష్ప ది రైజ్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ పూర్తిగా ఈ చిత్రం కోసం ఇమేజ్ మేకోవర్ కు వెళ్లడం విశేషం. పుష్పకు సంబంధించి అంతా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే మొదటి పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రెండో పాట 13వ తేదీన విడుదల కానుంది.

రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది. ఇక దర్శకుడు సుకుమార్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ కు విచ్చేశాడు. అక్కడ అభిమానులతో ముచ్చటించిన సుకుమార్ పుష్ప గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలిపాడు. ఇంకా రెండు పాటల షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉందిట. వీటితో పుష్ప మొదటి భాగం షూటింగ్ పూర్తవుతుందని తెలిపాడు.

- Advertisement -

ఈ చిత్రంలో సునీల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసాడు. ఆ పాత్రపై కూడా క్లారిటీ ఇచ్చాడు సుకుమార్. సునీల్ పాత్ర మొదటి భాగంలో చివరి వరకూ ఉంటుందని దాని తర్వాత మెయిన్ విలన్ ఫహద్ ఎంట్రీ ఇస్తాడని క్లారిటీ ఇచ్చాడు. సో సునీల్ పాత్ర మొదటి భాగంలో చనిపోతుందని అనుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All