Homeటాప్ స్టోరీస్25 ఏళ్ల త‌రువాత మెగా ఫోన్ ప‌ట్టారు!

25 ఏళ్ల త‌రువాత మెగా ఫోన్ ప‌ట్టారు!

25 ఏళ్ల త‌రువాత మెగా ఫోన్ ప‌ట్టారు!
25 ఏళ్ల త‌రువాత మెగా ఫోన్ ప‌ట్టారు!

80 నుంచి 90వ ద‌శ‌కం వ‌ర‌కు క‌థ‌నాయిక‌గా ఓ వెలుగు వెళిగారు హీరోయిన్ సుహాసిని. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో అత్య‌ధిక చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అను హాస‌న్‌, అర‌వింద‌స్వామి జంట‌గా న‌టించిన `ఇందిర` చిత్రంతో ద‌ర్శ‌కురాలిగా మెగా ఫోన్ ప‌ట్టారు. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు.

మంచి విజ‌యాన్ని సాధించింది. అయితే ఆ త‌రువాత సుహాసిని మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌లేదు. ద‌ర్శ‌క‌త్వం వైపు చూడ‌లేదు. దాదాపు 25 ఏళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ ఆమె మెగా ఫోన్ ప‌ట్టారు. డైరెక్ట‌ర్‌గా మ‌ళ్లీ యాక్ష‌న్ క‌ట్ చెప్పారు. అదీ లాక్‌డౌన్ టైమ్‌లో.. `మై లాక్‌డౌన్ స్టోరీస్‌` పేరుతో 20 నిమిషాల నిడివిగ‌ల షార్ట్ ఫిల్మ్‌ని రూపొందించింది. ఈ షార్ట్ ఫిల్మ్‌ని త‌న ఐఫోన్‌తో రూపొందించాన‌ని వెల్ల‌డించింది సుహాసిని.

- Advertisement -

లాక్‌డౌన్ స్టోరీస్ పేరుతో రూపొందించిన ఈ ల‌ఘు చిత్రంలో అహ‌నా కృష్ణ‌, సుహాసిని మ‌ణిర‌త్నం, కోమ‌లం, చారుహాస‌న్ కృష్ణ‌న్ త‌దిత‌రులు న‌టించారు. కెవిన్ దాస్ ఎడిటింగ్‌,  జేమ్స్ వ‌సంత‌న్ సంగీతం అందించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ని మ‌రో 4, లేదా 5 రోజుల్లో రిలీజ్ చేస్తాన‌ని సుహాసిని సోష‌ల్ మీడియా ఇన్ స్టా ద్వారా వెల్ల‌డించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All