80 నుంచి 90వ దశకం వరకు కథనాయికగా ఓ వెలుగు వెళిగారు హీరోయిన్ సుహాసిని. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అత్యధిక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అను హాసన్, అరవిందస్వామి జంటగా నటించిన `ఇందిర` చిత్రంతో దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టారు. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు.
మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ తరువాత సుహాసిని మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. దర్శకత్వం వైపు చూడలేదు. దాదాపు 25 ఏళ్ల విరామం తరువాత మళ్లీ ఆమె మెగా ఫోన్ పట్టారు. డైరెక్టర్గా మళ్లీ యాక్షన్ కట్ చెప్పారు. అదీ లాక్డౌన్ టైమ్లో.. `మై లాక్డౌన్ స్టోరీస్` పేరుతో 20 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ని రూపొందించింది. ఈ షార్ట్ ఫిల్మ్ని తన ఐఫోన్తో రూపొందించానని వెల్లడించింది సుహాసిని.
లాక్డౌన్ స్టోరీస్ పేరుతో రూపొందించిన ఈ లఘు చిత్రంలో అహనా కృష్ణ, సుహాసిని మణిరత్నం, కోమలం, చారుహాసన్ కృష్ణన్ తదితరులు నటించారు. కెవిన్ దాస్ ఎడిటింగ్, జేమ్స్ వసంతన్ సంగీతం అందించారు. ఈ షార్ట్ ఫిల్మ్ని మరో 4, లేదా 5 రోజుల్లో రిలీజ్ చేస్తానని సుహాసిని సోషల్ మీడియా ఇన్ స్టా ద్వారా వెల్లడించింది.