Homeటాప్ స్టోరీస్మైత్రీ వారి ఆఫ‌ర్‌ని సుధా కొంగ‌ర తిర‌స్క‌రించారా?

మైత్రీ వారి ఆఫ‌ర్‌ని సుధా కొంగ‌ర తిర‌స్క‌రించారా?

మైత్రీ వారి ఆఫ‌ర్‌ని సుధా కొంగ‌ర తిర‌స్క‌రించారా?
మైత్రీ వారి ఆఫ‌ర్‌ని సుధా కొంగ‌ర తిర‌స్క‌రించారా?

సూర్య నటించిన `ఆకాశం నీ హద్దూ రా` ఆమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లై భారీ విజ‌య‌మాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. దీపావళి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ లో విడుద‌లై విమ‌ర్శ‌కుల  ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రాన్ని సుధా కొంగ‌ర తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి. ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఊహించ‌ని స్థాయిలో ఆక‌ట్టుకోవ‌డంతో సుధా కొంగ‌ర‌పై ఆఫ‌ర్ల వ‌ర్షం కురుస్తోంది.

ఆమెతో సినిమా చేయాల‌ని నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగులో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ‌గా పేరునున్న మైత్రి మూవీ మేకర్స్ కూడా సుధా కొంగ‌ర‌ను సంప్రదించి ఫాన్సీ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. వారి ఆఫ‌ర్‌ని ఆమె సున్నితంగా తిర‌స్క‌రించి షాక్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు.  దీంతో టాలీవుడ్‌లో సుధా కొంగ‌ర – మైత్రీ ప్రాజెక్ట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -

టాలీవుడ్‌లో వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌ని లైన్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ ఆఫ‌ర్‌ని సుధా కొంగ‌ర తిర‌స్క‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే సుధా కొంగ‌ర లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఒక చిత్రానికి సైన్ చేయ‌డం వ‌ల్లే మైత్రీ వారి ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించిన‌ట్టు చెబుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సుధా కొంగ‌ర చేయ‌నున్న చిత్రం రతన్ టాటా జీవితం ఆధారంగా ఉంటుందని పుకార్లు ఉన్నాయి. మాధవన్ ఈ చిత్రంలో వ్యాపార వ్యాపారవేత్త పాత్రలో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెల‌య‌నున్నాయట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All