పవన్ కళ్యాణ్ జనసేన ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసారు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన గుంటూరు లో నిన్న రాత్రి జరిగింది . పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంని గుంటూరులో ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే . అయితే నిన్న అర్ధరాత్రి తర్వాత కొంతమంది ఆకతాయిలు బీర్ సీసాలతో జనసేన పార్టీ కార్యాలయం పై దాడి చేసారు.
- Advertisement -
ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు కానీ నిందితులు ఎవరు అన్నది మాత్రం తెలియలేదు . దాంతో పోలీసులు సీసీ ఫుటేజీ ని పరిశీలిస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలల్లో శాసనసభ కు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే . జనసేన తరుపున 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభ్యర్థులను నిలబెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ .
English Title: Strangers attack on Pawan kalyan’s Janasena office
- Advertisement -