సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిన్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతోంది.
మహేష్ సెట్లోకి ఎంటర్ కావడానికి సిద్ధమవుతున్నారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపుతూ ఈ చిత్రాన్ని సమాకాలీన అంశాలతో తెరకెక్కిస్తున్నారు. బ్యాకింగ్ రంగంలో జరిగిన ఓ వైట్ కాలర్ నేరాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని రూపొందించబోతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీ కోసం సాలీడ్ ఐటమ్ సాంగ్ని తమన్ సిద్ధం చేసినట్టు తెలిసింది.
ఈ పాటలో మహేష్తో కలిసి ఓ ప్రముఖ హీరోయిన్ స్టెప్పులేయనుందని తెలిసింది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా వుంచినట్టు చెబుతున్నారు. ఈ పాట మూవీకి హైలైట్గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇటీవల తమన్ సంగీతం అందించిన `అల వైకుంఠపురములో`ఆడియో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి చిత్ర విజయంలో ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో విలన్గా మిస్టర్ ఇండియా అనిల్ కపూర్ని చిత్ర బృందం సంప్రదించారట. పారితోషికం భారీ స్థాయిలో డిమాండ్ చేసేసరికి మరో నటుడి కోసం అన్వేషణ చేస్తున్నట్టు తెలిసింది.