గతేడాది వచ్చిన అతిపెద్ద చార్ట్ బస్టర్ రొమాంటిక్ సాంగ్ ‘సామజవరగమన’. ఐదు నెలల క్రితం విడుదలైన ఈ సాంగ్ అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలకు చాలా ముందే పాటను విడుదల చేయడం రిస్క్ అనుకున్నారంతా. కానీ అల వైకుంఠపురములో చిత్రం నుండి మొదటి సాంగ్ గా సామజవరగమన ను విడుదల చేసారు. ఈ సాంగ్ విడుదలవ్వడమే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమన్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం, సిద్ శ్రీరామ్ గాత్రం కలిసి ఈ పాటను ఒక క్లాసిక్ గా నిలిపింది.
సామజవరగమన సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. తెలుగు పాటల వరకూ ఉన్న రికార్డులు అన్నిటినీ ఈ పాట చెరిపేసింది. ఇప్పటికీ ఈ సాంగ్ ప్రతిచోటా వినిపిస్తుండడం విశేషం. యూట్యూబ్ లో ఇప్పటికే ఈ సాంగ్ 160 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది. అలాగే జియో సావన్ లో కూడా రీసెంట్ గా ఈ సాంగ్ 100 మిలియన్ ప్లేస్ ను క్రాస్ చేసింది. ఇంతటి లెజండరీ హిట్ అయిన సాంగ్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోంది.
లిరిక్ రైటర్ పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ సిద్ శ్రీరామ్, తమన్ కలిసి మరోసారి పనిచేయబోతున్నట్లు రీసెంట్ గా సంగీత దర్శకుడు ట్విట్టర్ లో ప్రకటించాడు. అది ఏ సినిమానో గెస్ చేయమని తన ఫాలోయర్స్ ను అడిగాడు. అయితే వాళ్లలో చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం పింక్ రీమేక్ కు తమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తోన్న విషయం తెల్సిందే. ఇందులో ఒక మెలోడీ కోసం సిద్ శ్రీరామ్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి మరోసారి ఈ కాంబో ఎటువంటి మ్యాజిక్ చేస్తుందనేది చూడాలి. పింక్ రీమేక్ షూటింగ్ గత నెలలో మొదలైన విషయం తెల్సిందే.
All ur guesses r 99.9% right !! @sidsriram sings for #PSPK26 !!
Hope u all like it
We have put our heart & soul for this @SVC_official
My love to #dilraju gaaru #VenuSriRam gaaru @ramjowrites !! For this songCan’t wait for u guys to listen this !! ?
♥️ pic.twitter.com/BwUAlwXnJo— thaman S (@MusicThaman) February 12, 2020
Credit: Twitter