Homeటాప్ స్టోరీస్ఆ హీరో నాకు చాలా స్పెష‌ల్!

ఆ హీరో నాకు చాలా స్పెష‌ల్!

ఆ హీరో నాకు చాలా స్పెష‌ల్!
ఆ హీరో నాకు చాలా స్పెష‌ల్!

కొన్ని కాంబినేష‌న్‌లు వెండితెర‌పై హిట్ పెయిర్స్‌గా నిలుస్తుంటాయి. అలాంటి వారితో మ‌ళ్లీ మ‌ళ్లీ క‌లిసి న‌టించాల‌ని న‌టీన‌టులు కోరుకుంటారు. శృతిహాస‌న్ కూడా ఇదే విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టింది. దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత శృతిహాస‌న్ మ‌ళ్లీ టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన విష‌యం తెలిసిందే. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన `క్రాక్‌` మూవీతో శృతి రీ ఎంట్రీ ఇచ్చింది.

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీల సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ తో మంచి క‌మ్ బ్యాక్ మూవీని సొంతం చేసుకున్న శృతిహాస‌న్ త‌న‌కు హీరో మాస్ మ‌హారాజా ప్ర‌త్యేకం అని చెబుతోంది. ఆమె కీల‌క పాత్ర‌లో న‌టించి నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ `పిట్ట‌క‌థ‌లు` మ‌రికొన్ని గంట‌ల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. `ల‌స్ట్ స్టోరీస్‌` ఆధారంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ రిలీజ్ సంద‌ర్భంగా శృతిహాసన్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది.

- Advertisement -

టాలీవుడ్ హీరోల‌తో క‌లిసి న‌టించ‌డం ప‌ట్ల త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అల్లు అర్జున్‌తో `రేసు గుర్రం`లో న‌టించాన‌ని, వృత్తి ప‌ట్ల ఆయ‌న అంకిత భావంతో వుంటార‌ని, సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫుల్ ఎనర్జీతో వుంటార‌ని, ఆయ‌న‌తో క‌లిసి స్క్రీర్ పంచుకునే అవ‌కాశం రావ‌డం నా అదృష్టం అని తెలిపింది. అయితే మాస్ మ‌హారాజా ర‌వితేజ గురించి ప్ర‌త్యేకంగా వెల్ల‌డించింది. ర‌వితేజ‌తో బ‌లుపు, క్రాక్ చిత్రాల్లో న‌టించాను. కెరీర్ ప్రారంభంలో `బ‌లుపు` చిత్రంలో న‌టిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న నాకెంతో స‌పోర్ట్ చేశారు. సీనియ‌ర్ న‌టుడ‌నే అహంభావం ఆయ‌న‌లో క‌నిపించ‌దు. ఒక్క మాట‌లో చెప్పాలంటే నా హృద‌యంలో ఆయ‌న‌కు ప్ర‌త్యేక స్థానం వుంది` అని షాకింగ్ విష‌యం బ‌య‌ట‌పెట్టింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All