వెండితెరపై మెస్మరైజ్ చేస్తున్న స్టార్స్ దానితో పాటు నిర్మాతలుగా, దర్శకులుగా, కొరియోగ్రఫీ, ఫైట్ మాస్టర్లుగా మారి ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అసిస్టెంట్ డైరెక్టర్గా మారి దుల్కర్ సల్మాన్ చిత్రానికి పని చేసి ఆశ్యర్యపరిచింది. తాజాగా మరో హీరోయిన్ రైటర్ గా తన టాలెంట్ని చూపించబోతోంది.
ఆమె పవన్ హీరోయిన్ శృతిహాసన్. `క్రాక్` సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మళ్లీ ట్రాక్లోకి వచ్చిన శృతి ప్రస్తుతం పవన్తో కలిసి `వకీల్సాబ్` చిత్రంలో నటిస్తోంది. ఇదిలా వుంటే తనకు స్క్రిప్ట్ రైటర్ అవ్వాలను ఆలోచన పుట్టిందట. లాక్డౌన్ టైమ్లో పలు స్క్రిప్ట్లు రాశానని ఇటీవలే బయటపెట్టింది. ఆ కథలకు ప్రస్తుతం స్క్రీన్ప్లే రాస్తోందట.
ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న శృతి ఖాలీ దొరికితే చాలు పాటలు, స్క్రిప్ట్లు రాసేస్తోందట. ఇవే తనకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయని, అంతే కాకుండా పాటలు, స్క్రిప్ట్స్ రాయడంలో తను చాలా ఇంప్రూవ్ అయ్యానని శృతి చెబుతోంది. ఇంతకీ తను రాసిన కథల్ని తానే డైరెక్ట్ చేస్తుందా? లేక మరొకరికి తన కథల్ని అందజేస్తుందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.