Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ , మహేష్ , చరణ్ లపై సెటైర్ వేసిన శ్రీరెడ్డి

ఎన్టీఆర్ , మహేష్ , చరణ్ లపై సెటైర్ వేసిన శ్రీరెడ్డి

srireddy setire on ntr , mahesh and charan వివాదాస్పద నటి శ్రీరెడ్డి తెలుగు అగ్ర హీరోలపై సెటైర్ వేసింది . మన సినిమా హీరోల కంటే మీరే నిజమైన హీరోలు అంటూ ప్రవాసాంధ్రులను పొగుడుతోంది శ్రీరెడ్డి . ఇంతకీ మన తెలుగు హీరోలను తిడుతూ , ప్రవాసాంధ్రులను శ్రీరెడ్డి ఎందుకు మెచ్చుకుంటుందో తెలుసా …….. ఆంధప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో . గతకొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న విషయం తెలిసిందే . అయితే ఆ డిమాండ్ విషయంలో పలువురు అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్ మినహా మిగతా వాళ్ళు పెద్దగా స్పందించలేదు . ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ , చరణ్ , అల్లు అర్జున్ , ప్రభాస్ ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టే ఉంది కానీ ఒక్క హీరో కూడా ప్రత్యేక హోదా మీద స్పందించలేదు .

ఇక మహేష్ బాబు అయితే ప్రత్యేక హోదా డిమాండ్ పట్ల స్పందించడానికి నిరాకరించాడు , రాజకీయాలు మాట్లాడనని …… కేవలం సినిమా విషయాలు మాత్రమే అంటూ తప్పించుకున్నాడు . ఇక మిగతా హీరోలు ఆంధ్రుల సమస్య మనది కాదు అన్నట్లుగా ప్రవర్తించారు కానీ ప్రవాసాంధ్రులు మాత్రం ఆంధప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ నినదిస్తున్నారు . దాంతో వాళ్ళ పోరాటాన్ని కీర్తిస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి . మన హీరోలు రీల్ హీరోలు మాత్రమే , కానీ నిజమైన హీరోలు మీరే అంటూ ఎన్నారై లను పొగుడుతోంది శ్రీరెడ్డి . ప్రవాసాంధ్రులు శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే . దాంతో వాళ్ళ పోరాటానికి మద్దతు తెలుపుతోంది శ్రీరెడ్డి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All