రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని థియేటర్ లని తమ గుప్పిట్లో పెట్టుకొని వందలాది మంది నిర్మాతలను రోడ్డున పడేలా చేసి, కొంతమంది చావుకు కారణమైన నియంతలు దిల్ రాజు , దగ్గుబాటి సురేష్ బాబు , అల్లు అరవింద్ లని వదిలి పెట్టేది లేదని వాళ్ళ గుండెల్లో నిద్ర పోతానని సవాల్ చేస్తోంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . తెలుగు రాష్ట్రాలలో థియేటర్ ల సమస్య పట్టి పీడిస్తోంది . థియేటర్ లను లీజుకి తీసుకొని నిర్మాతల నుండి ముక్కుపిండి మరీ వసూల్ చేస్తున్నారు డబ్బులు . దాంతో పలువురు నిర్మాతలు సినిమాలు నిర్మించి మరీ రోడ్డున పడుతున్నారు .
ఇప్పటికే పలువురు చిన్న నిర్మాతలు థియేటర్ ల సమస్య ని పరిష్కరించమని అటు ప్రభుత్వాన్ని ఇటు ఫిలిం ఛాంబర్ పెద్దలను కోరుతున్నప్పటికీ ఆ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు . చిన్న నిర్మాతల పాలిట యమకింకరుల మాదిరిగా తయారయ్యారు దాంతో దిల్ రాజు , సురేష్ బాబు , అల్లు అరవింద్ లను చావుదెబ్బ కొడతానని , నన్నేం చేస్తారో చేసుకోండి…… నేను మీ గుండెల్లో నిద్రపోతా అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది శ్రీరెడ్డి . గతకొంతకాలంగా శ్రీరెడ్డి వివాదం చిత్రపరిశ్రమలో నలుగుతూనే ఉంది ఇక ఇప్పుడేమో దిల్ రాజు , సురేష్ బాబు లపై పడింది శ్రీరెడ్డి .