బిగ్ బాస్ 5లో నిన్న కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. శ్రీరామ్ చంద్ర ఇంటి కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో మానస్, సన్నీలు అత్యధికంగా 10 కిలోలకు పైగా తగ్గారు. మానస్ రెండు రోజుల్లోనే 6 కిలోలు తగ్గడం విశేషం. శ్రీరామ్ చంద్ర-హమీద జంట బరువు తగ్గడంతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే మూడో స్థానంలో శ్వేతా వర్మ-అన్నీ మాస్టర్ లు ఉన్నారు. ఈ మూడు జంటలు కెప్టెన్సీ పోటీదారుల పోటీకి నెక్స్ట్ లెవెల్ కు వెళ్తారని బిగ్ బాస్ చెప్పాడు. ఈ మూడు జంటల్లో ఒక్కొక్కరు కెప్టెన్సీ రేసులో నిలబడాలి. ఫైనల్ గా చర్చల అనంతరం సన్నీ, శ్రీరామ్ చంద్ర, శ్వేతా వర్మలు కెప్టెన్సీ రేసులో నిలిచారు.
ముగ్గురూ తాము ఎందుకు ఇంటి కెప్టెన్ కు అర్హులో చెప్పాల్సి ఉంటుంది. అలాగే మిగతా కంటెస్టెంట్స్ ఎవరు అనర్హులో చెబుతూ వారిని కత్తితో పొడవాలి. ఈ నేపథ్యంలో సన్నీకి ఎక్కువ మంది కత్తిపోట్లు పొడిచారు. సన్నీ ఈ విషయంలో హర్ట్ అయ్యాడు. చాలా మంది సరైన కారణాలు చెప్పకుండా సన్నీకి పొడిచారు. ఇక తక్కువ కత్తిపోట్లు వచ్చిన శ్రీరామ్ చంద్ర ఇంటి కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
అలాగే ఈరోజు ఇంటి వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు, బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అన్నది నిర్ణయించాల్సి ఉంటుంది. మరి ఎవరు అవుతారో చూడాలి.