హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శ్రీహరి చెరిగిపోని ముద్ర వేసాడు , అయితే అచిరకాలంలోనే అంతర్దానం అయ్యాడు . కట్ చేస్తే ఇప్పుడు శ్రీహరి వారసుడు హీరోగా తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమైంది . బాలనటుడిగానే భైరవ సినిమాలో నటించిన మేఘాంశ్ నటనలో డ్యాన్స్ లో తర్ఫీదు పొందాడు . ఇప్పుడు రాజ్ దూత్ అనే చిత్రంలో హీరోగా నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు .
శ్రీహరి కి తెలుగు చిత్రరంగంలో మంచి పేరు ఉన్న విషయం తెలిసిందే . ఎవరికైనా ఆపద ఉంటే తక్షణం స్పందించే మంచి గుణమున్న శ్రీహరి అకాల మరణం అభిమానులను , శ్రేయోభిలాషులను తీవ్రంగా కలిచి వేసింది . కట్ చేస్తే అలాంటి శ్రీహరి కొడుకు హీరోగా మారుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు . ఇక ఈ సినిమా ద్వారా కార్తీక్ – అర్జున్ లు దర్శకులుగా పరిచయం అవుతున్నారు . వారసుల రాజ్యం లోకి శ్రీహరి వారసుడు కూడా వస్తున్నాడు .