Homeగాసిప్స్`పెళ్లిసంద‌డి` సీక్వెల్ కోసం శ్రీ‌దేవి ముద్దుల కూతురు?

`పెళ్లిసంద‌డి` సీక్వెల్ కోసం శ్రీ‌దేవి ముద్దుల కూతురు?

`పెళ్లిసంద‌డి` సీక్వెల్ కోసం శ్రీ‌దేవి ముద్దుల కూతురు?
`పెళ్లిసంద‌డి` సీక్వెల్ కోసం శ్రీ‌దేవి ముద్దుల కూతురు?

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో 1996లో వ‌చ్చిన రొమాంటిక్ మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీ `పెళ్లి సంద‌డి“`. శ్రీ‌కాంత్‌, ర‌వ‌ళి, దీప్తీ భ‌ట్నాగ‌ర్ హీరోహీరోయిన్‌లుగా న‌టించారు. కీర‌వాణి సంగీతంలో సి.అశ్వ‌నీద‌త్‌, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంహీరో శ్రీ‌కాంత్ కెరీర్‌ని ఓ మ‌లుపు తిప్పింది. కీర‌వాణి అందించిన సంగీతం ఈ చిత్రాన్ని ఎక్క‌డో నిల‌బెట్టింది.

ఎవ‌ర్‌గ్రీన్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి ప్ర‌స్తుతం సీక్వెల్‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. కె. రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొంద‌నున్న ఈ సీక్వెల్‌లో హీరోగా శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ న‌టించ‌బోతున్నాడు. `పెళ్లిసంద‌D` పేరుతో రూపొంద‌నున్నఈ మూవీ ద్వ‌రా హీరోయిన్‌గా అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముద్దుల కూతురు ఖుషీక‌పూర్‌ని ప‌రిచ‌యం చేయాల‌ని భావిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇంత‌కు ముందే ఇందులో హీరోయిన్‌గా మ‌ల‌యాళీ బ్యూటీ మాళ‌విక నయ‌ర్ పేరు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఖుషీ క‌పూర్‌ని ఈ మూవీ ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నార‌ట‌. ఆర్కా మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో కె. రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు కె. కృష్ణ‌మోహ‌న్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించ‌య‌నున్నట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All