మెగా ఫ్యామిలీ లో ఒకరు నాకు బాగా క్లోజ్ …… అతడు చెప్పిన దాని ప్రకారం ప్రజారాజ్యం పార్టీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని , ఆ సంగతి చెబితే అందరూ అవాక్కవడం ఖాయం ….. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రివీల్ చేస్తా ” అని సంచలన కామెంట్ చేస్తోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉందని భావిస్తున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పై మెగా కుటుంబం పై అస్త్రాన్ని ఎక్కుపెట్టింది శ్రీ రెడ్డి .
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటనలో ఉన్నాడు , అక్కడ ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుండటంతో మెగా అభిమానులు సంతోషంగా ఉండగా ఆ సంతోషాన్ని ఎక్కువ సేపు ఉంచకుండా నీళ్లు చల్లేస్తోంది శ్రీ రెడ్డి . 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే . అందులో పవన్ కళ్యాణ్ యువ రాజ్యం అధ్యక్షుడి గా ఉన్నాడు అలాగే అల్లు అరవింద్ ముఖ్య భూమిక పోషించాడు . కట్ చేస్తే ఎన్నికల సమయం నాటికి ప్రజారాజ్యం పార్టీ టికెట్ల ని అమ్ముకుంటోంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దాంతో ఘోర పరాజయం పాలయ్యింది ఆ పార్టీ కట్ చేస్తే …… తక్కువ సమయంలోనే ఆ పార్టీ జెండా కూడా పీకేశారు . ఇక ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి . అప్పటి విషయాలు త్వరలోనే చెబుతా అంటూ సోషల్ మీడియాని హీటెక్కించింది . దాంతో మెగా ఫ్యాన్స్ శ్రీ రెడ్డి పై ఆగ్రహంగా ఉన్నారు .