శ్రీరంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్. దామోదరప్రసాద్ `అలా మొదలైంది` చిత్రంతో మళ్లీ సినిమాల నిర్మాణం మొదలుపెట్టారు. ఈ మూవీ అనూహ్య విజయాన్ని సాధించడంతో బ్యాక్టు బ్యాక్ విభిన్నమైన చిత్రాల్ని అందిస్తూ వస్తున్నారు. ఈ బ్యానర్పై వచ్చిన `అంతకు ముందు ఆ తరువాత, కల్యాణ వైభోగమే వంటి విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్లని అందించారు.
కొంత విరామం తరువాత కె.ఎల్. దామోదర ప్రసాద్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం `ఫాదర్ – చిట్టి- ఉమ- కార్తీక్`. జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కార్తీక్, అమ్ము అభిరామి జంటగా నటిస్తున్నారు. విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ని చిత్ర బృందం గురువారం విడుదల చేసింది.
చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యరక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ వెల్లడించారు. కథానుసారమే ఈ చిత్రానికి ఈ టైటిల్ని ఫైనల్ చేశామని, గత చిత్రాల తరహాలోనే ఆద్యంతం వినోదాత్మకంగా వుంటుందన్నారు.