మెగాస్టార్ చిరంజీవి గారు మీ పేరు చెప్పుకొని నిర్మాత వాకాడ అప్పారావు వందలాది మంది మహిళల జీవితాలను నాశనం చేసాడు కాబట్టి అతడ్ని ఎంకరేజ్ చేయకండి అంటూ మరో బాంబ్ పేల్చి సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి . నిన్న సాయంత్రం తెలుగు సినిమా ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి శ్రీరెడ్డి వివాదం పై స్పందించడమే కాకుండా ఆమెపై ఎటువంటి నిషేధం లేదని ప్రకటించారు అంతేకాదు శ్రీరెడ్డి ఆరోపణలపై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు కూడా దాంతో ఇక గొడవ సద్దుమణిగినట్లే అని అనుకున్నారు .
కట్ చేస్తే మళ్ళీ శ్రీరెడ్డి మెగాస్టార్ పై బాంబ్ పేల్చి పిచ్చ షాక్ ఇచ్చింది . నిర్మాత వాకాడ అప్పారావు శ్రీరెడ్డి ని మోసం చేసాడట ! నన్ను ఒక్కదాన్నే కాకుండా వందలాది మంది ని మోసం చేసాడని పైగా చిరంజీవి పేరు వాడుకున్నాడని అంటోంది . ఈ సంచలన ఆరోపణలపై మెగా కాంపౌండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి .