శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం `శ్రీకారం`. బి. కిషోర్ దర్శకుడి గా పరిచయమైన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజే మంచి టాక్ని సొంతం చేసుకుంది.
కొత్త తరం వ్యవసాయాన్ని కూడా ప్రొఫెషన్గా ఎంచుకోవాలని ఈ రంగంలో వస్తున్న అధునాతన పద్దతుల్ని పాటించాలని చక్కని సందేశాన్ని అందిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 4.01 కోట్ల షేర్ని సాధించింది. పైజామ్లో 1.10 కోట్లు వసూలు చేయగా, ఆంధ్రా నుంచి 2.16 కోట్లు, సెడెడ్ నుంచి రూ .75 లక్షలు వసూలు చేసింది.
తొలి రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల షేర్ వివరాలు
నైజాం : 1.10 కోట్లు
కృష్ణ : 0. 25 లక్షలు
గుంటూరు : 0.65 లక్షలు
వైజాగ్ : 0.54 లక్షలు
తూర్పు గోదావరి : 0.30 లక్షలు
పశ్చిమ గోదావరి : 0.28 కోట్లు
నెల్లూరు : 0.14 లక్షలు
సెడెడ్ : 0.75 లక్షలు
ఏపీ, తెలంగాణ వసూలు చేసిన మొత్తం షేర్ : 4.01 కోట్లు