మెగా హీరో రామ్ చరణ్.. ఏస్ డైరెక్టర్ శంకర్ కలయిక లో పాన్ ఇండియా స్థాయి మూవీ త్వరలో తెరపైకి రానున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ని ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రంపై రకరకాల హాగానాలు మొదలయ్యాయి. మొదట ఈ చిత్ర కథ గురించి ఓ న్యూస్ వైరల్ కాగా.. ఆ తరువాత ఈ చిత్ర నిర్మాణం విషయంలో పక్కా ప్లాన్ని దిల్ రాజు సూచించారంటూ వార్తలు షికారు చేశాయి.
సామాజిక సందేశంతో కూడిన రాజకీయ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంపై మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో దక్షిణ కొరియా నటి చరణ్ తో రొమాన్స్ చేసే అవకాశం ఉందని వార్తలు మొదలయ్యాయి. ఆ నటి పేరు `బే సుజీ` . ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోల్ని మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
దీనికి సంబంధించి ఎలాంటి వార్తని మేకర్స్ ఇంత వరకు ఖండించ లేదు. ఓకే అని చెప్పలేదు. దీంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రానున్న 50 వ చిత్రం కావడంతో దిల్ రాజు ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాల్ని మేకర్స్ ప్రకటించే అవకాశం వుందని తెలిసింది.