రీల్ లైఫ్లో విలన్.. కానీ రియల్ లైఫ్లో మాత్రం హీరో… ఆయనే సోనుసూద్. వెండితెరపై విలన్గా ఆకట్టుకుంటున్న సోనుసూద్ లాక్డౌన్ కారణంగా ఒక్కసారిగా హీరో అయిపోయారు. కరోనా స్వైర విహారం చేస్తున్న వేళ ఉన్న ఫలంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో తమ సొంతూళ్లకు వెళ్లాలల్సిన వలస కూలీలంతా కాలినడకన గమ్యానికి చేరుకోవడం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రభుత్వాలకు భిన్నంగా స్పందించి ఆపన్నుల పాలిటి పెద్దన్నగా నిలిచారు. దేశ వ్యాప్తంగా రియల్ హీరోగా జేజేలు అందుకున్నారు. ఆయనకు ఏకంగా కొంత మంది గుడి కట్టించిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే సోసుసూద్ త్వరలో నిర్మాతగా మారబోతున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల స్వయంగా వెల్లడించారు.
`అవును నిజమే నిర్మాతగా మారబోతున్నాను. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రజల్లో స్ఫూర్తినింపే కథలు, నేను చేయాలనుకుంటున్న కథల కోసం వెతుకుతున్నాను. అన్నీ కుదిరితే నటుడిగా, నిర్మాతగా మీ ముందుకు వస్తాను` అన్నారు సోనుసూద్. ఆయన తన తండ్రి శక్తి సాగర్ పేరుతో
ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్ని ప్రారంభించారు. కానీ చాలా కాలంగా నిర్మాణం చేపట్టలేదు. మళ్లీ ఇన్నాళ్లకు అదే బ్యానర్పై తనకు నచ్చిన, తను మెచ్చిన కథల్ని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారట.