కరోనా కారణంగా దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది. జన జీవితం స్తంభించిపోయింది. అప్పటి వరకు తాపీగా సాగిన జీవితాలన్నీ జీవితాలన్నీ ఒక్కసారిగా చిన్నాభిన్నం అయిపోయాయి. ఇక దినసరి వేతన కూలీలు, వలస కూలీలది అరణ్య రోదనే. వలస కూలీల వెతల గురించి చెప్పడానికి మాటలు చాలవు. కరోనా కష్టకాలంతో సడన్గా విధించిన లాక్డౌన్ కారణంగా వలస కూలీలు నరకం చూశారంటే అది తక్కువే అవుతుంది.
సొంత ఊరు చేరడం కోసం వలస కూలీలు వేల కిలోమీటర్లు కాలినడకన వెళ్లడం తెలిసిందే. ఇది వెండితెర విలన్ సోనూసూద్ చలించిపోయారు. కష్టం అన్న వారికి నేనున్నానంటూ ముందుకొచ్చారు. బస్లని ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు చేర్చారు. కొంత మందిని ఏకంగా ఫ్లైట్లో వారి ఇంటికి చేర్చారు. ట్రైన్లని కూడా ఏర్పాటు చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇందు కోసం భారీగానే ఖర్చు చేశారు. ఆకలి అన్న వారికి అన్నంపెట్టారు. సనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచి ఆర్థిక సహాయం చేశారు.
సోనూ వందల కోట్లు ఎలా సంపాదించాడు అనే చర్చనీయాంశంగా మారింది. వంద కోట్ల ఆస్తులు కూడబెట్టాడు కాబట్టే ఖర్చు చేశాడని వార్తలు శికారు చేశాయి. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం బయటికి వచ్చింది. దేశ వ్యాప్తంగా సోనూ సహాయం చేయడానికి తన ఆస్తుల్ని తాకట్టు పెట్టాడట. ముంబైలో 10 కోట్లు విలువ చేసే ప్లాట్లని రెండు దుకాణాలని సోనూ తాకట్టుపెట్టారట. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్పై నవంబర్ 24న రిజిస్ట్రేషన్పై సంతకాలు చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన వాళ్లంతా షాక్కు గురవుతున్నారు. `ఎదురుటి వారి కోసం ఇలాంటి పని చేసిన వారిని నేను ఇంత వరకు చూడలేదు` అని వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ రితేష్ మెహతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.