బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం యంగ్ టాలెంటెడ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్ సింగ్ నెపోటిజమ్ కారణంగానే చనిపోయాడంటూ నెటిజన్స్ బాలీవుడ్ సెలెబ్రిటీ లపై దుమ్మెత్తి పోస్తున్నారు. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ ల కారణంగానే సుశాంత్ మరణించాడని వారిపై ఓ అడ్వాకెట్ కేస్ ఫైల్ చేయడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే ప్రముఖ సింగర్ సోను నిగమ్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో మరింత దుమారాన్ని రేపుతున్నాయి. మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ ఆత్మహత్యలు చూడబోతున్నారని సోను నిగమ్ వ్యాఖ్యానించడంతో బాలీవుడ్ లో ఎం జరగబోతోందని చర్చ మొదలైంది. సుశాంత్ మరణం వరకు సైలెంట్ గా వున్నా వాళ్లంతా గళం వుప్పుతుండటంతో ఈ చర్చ దేనికి దారితీస్తుందో అని అంతా అటెన్షన్ తో ఎదురుచూస్తున్నారు.
సోను నిగమ్ సంగీత ప్రపంచంలో చాలా మంది బంధుప్రీతి కారణంగా ఇబ్బందులు పడుతున్నారని, మాఫియా కారణంగా లిరిసిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఇండస్ట్రీలో రెండు కంపెనీలు మాత్రమే దదబ్దాలుగా చక్రం తిప్పుతున్నాయని, ఎవరు పాడాలో , ఎవరు పాడకూడదో వారే నిర్ణయిస్తున్నారని ఈ పరిస్థితిలో మార్పురాకపోతే మ్యూజిక్ ఇండస్ట్రీ లోనూ సుశాంత్ తరహా ఆత్మహత్యలు తప్పవని సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
- Advertisement -