లాక్డౌన్ కారణంగా గత తొమ్మిది నెలలుగా సినీ ఇండస్ట్రీ స్థంభించిపోయింది. థియేటర్లు మూసి వేయడంతో సినీ రంగం సంక్షోభంలోకి వెళ్లిపోయింది. కరోనా స్వైర విహార ప్రభావం కొంత వరకు తగ్గడంతో అన్ని రంగాలకి కేంద్ర వెసులు బాటుని కల్పించడంతో థియేటర్లు కూడా రీఓపెన్ కావడం మొదలైంది. ఈ నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? .. రారా పరిస్థితి మారుతుందా? అని ఇండస్ఠ్రీ వర్గాలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో టార్చ్ బేరర్ తరహాలో థియేటర్లలోకి వచ్చిన చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. సాయిధరమ్తేజ్ నటించిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. పెద్ద సినిమా ముందుకొస్తే తప్ప థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదని తేలడంతో సాయిధరమ్తేజ్ ఆ బాధ్యతల్ని భూజాన వేసుకుని `సోలో బ్రతుకే సో బెటర్` సినిమాతో థియేటర్లకు వచ్చాడు. జీ స్టూడియోస్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ హక్కుల్ని దక్కించుకున్నా మేకర్స్ అభ్యర్థన మేరకు ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు.
ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన కోసం యావత్ సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొత్త వైరస్ ప్రబలే అవకాశాలు వున్నాయని వార్తలు వినిని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందినా ప్రేక్షకులు మాత్రం `సోలో బ్రతుకే సో బెటర్`ని థియేటర్లలో చూడటానికి భారీ సంఖ్యలో స్పందించారు. దీనికి అడ్వాన్స్ బుకింగ్సే నిదర్శనం. మౌత్ టాక్ మరింతగా స్ప్రెడ్ అయితే ఈ మూవీకి ప్రేక్షకుల తాకిడి రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం వుంది.