Homeటాప్ స్టోరీస్సితార అనౌన్స్‌మెంట్ ప‌వ‌ర్‌స్టార్ కోస‌మేనా?

సితార అనౌన్స్‌మెంట్ ప‌వ‌ర్‌స్టార్ కోస‌మేనా?

సితార అనౌన్స్‌మెంట్ ప‌వ‌ర్‌స్టార్ కోస‌మేనా?
సితార అనౌన్స్‌మెంట్ ప‌వ‌ర్‌స్టార్ కోస‌మేనా?

వ‌రుస విజ‌యాల‌తో క్రేజీ ఫిల్మ్ మేక‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు యువ నిర్మాత సూర్య దేవ‌ర నాగ‌వంశీ. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్‌పై ఆయ‌న ఇటీవ‌ల చేసిన `జెర్సీ`, భీష్మ అనూహ్య విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ రెండు చిత్రాల స‌క్సెస్ అందించిన  ఉత్సాహంలో వున్న ఆయ‌న నితిన్‌తో ప్ర‌స్తుంత `రంగ్ దే` చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. విజ‌య‌వంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తాజా షెడ్యూల్‌ని టీమ్ పూర్తి చేసింది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్ర బృందం పాట‌ల కోసం ఇట‌లీ వెళ్ల‌బోతోంది. ఇదిలా వుంటే ఈ చిత్ర నిర్మాత మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్ రైట్స్‌ని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

ఈ చిత్రాన్ని ప‌వ‌ర్‌స్టార్ వ‌న‌న్‌తో రీమేక్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బీజు మీన‌న్ పాత్ర‌లో ప‌వ‌న్ .. పృథ్వీరాజ్ సుఎకుమారన్ పాత్ర‌లో రానా క‌నిపించే అవ‌కాశం వుంద‌ని  వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే గురువారం చిత్ర బృందం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. శుక్ర‌వారం సాయంత్రం 4:05 నిమిషాల‌కు టైటిల్ అండ్ లోగోని అనౌన్స్ చేస్తున్నామంటూ ప్ర‌క‌టించింది. ఈ అనౌన్స్‌మెంట్ ప‌వ‌ర్‌స్టార్‌తో చేయ‌బోతున్న `అయ్య‌ప్ప‌నుమ్ కోష‌యుమ్‌` రీమేక్ గురించేనా నఅన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All