ఇటివల టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ముందు బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. ఆయన కోలుకున్న వెంటనే రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీ కరోనా లక్షణాలతో హోమ్ క్వారెంటైన్కి వెళ్లడం.. ఆ కొద్ది రోజుల్లోనే వైరస్ని జయించి ప్లాస్మాని దానం చేయడం తెలిసిందే. ఆ తరువాత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా కరోనా సోకడంతో ఒక్కసారిగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు ఉలిక్కిపడ్డాయి.
ఆతరువాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు చరణ్ ప్రతీ రోజు అభిమానులకు వెల్లడించడం క్రమ క్రమేనా ఆయన వైరస్ నుంచి కోలుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ కాబోతున్నారన్న శుభవార్త అభిమానులకు చేరిన దశలో మరో ప్రముఖుడు కరోనా బారిన పడటం విస్మయాన్ని కలిగిస్తోంది.
ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా సోకినట్టు ఫేస్ బుక్ వీడియో ద్వారా స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ నెల 9న తనకు కరోనా సోకిందని, ఈ నెల 22తో హోమ్ ఐసోలేషన్ టైమ్ ముగుస్తుందని ఆయన వెల్లడించారు. ఇంట్లోనే ప్రత్యేక గదిలో తను వుంటుర్రారరి, ఈ దశలో తనకు హాస్టల్ రోజులు గుర్తొచ్చాయన్నారు. తను పూర్తి ఆరోగ్యంగా వున్నానని, ఎవరూ కంగారు పడొద్దని, అలాగే కరోనాని ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని వెల్లడించారు.