Homeటాప్ స్టోరీస్వైర‌స్ సోకిన అభిమానికి ఫోన్ చేసిన‌ హీరో‌!

వైర‌స్ సోకిన అభిమానికి ఫోన్ చేసిన‌ హీరో‌!

వైర‌స్ సోకిన అభిమానికి ఫోన్ చేసిన‌ హీరో‌!
వైర‌స్ సోకిన అభిమానికి ఫోన్ చేసిన‌ హీరో‌!

క‌రోనా వైర‌స్ ప్రపంచాన్ని వ‌ణికిస్తోంది. ఏ దేశ వార్త‌లు విన్నా క‌రోనా కేసులే.. క‌రోనా మ‌ర‌ణాలే. మ‌న దేశంలోనూ క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డంతో సెల‌బ్రిటీలు, సామాన్యులు ఇంటికే ప‌రిమితం అయ్యారు. తాజాగా త‌మిళ హీరో శింబు అభిమాని శింబు ఆనంద్‌కు క‌రోనా వైర‌స్ సోకింది.

ఇటీవ‌ల చేసిన టెస్టుల్లో అత‌నికి పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యం తెల‌సుకున్న హీరో శింబు స‌ద‌రు అభిమానికి ఫోన్ చేసి ధైర్యం చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వైర‌స్ బారి నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, ఎట్టిప‌రిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవ‌ద్ద‌ని శింబు అత‌ని ధైర్యం చెప్పార‌ట‌.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా శింబు మాట్లాడుతూ ` అభిమానులు లేక‌పేతే తాను లేన‌ని, వారి వ‌ల్లే తాను ఈ స్థాయిలో వున్నాన‌ని, నాకు సినిమాలు లేని స‌మ‌యంలోనూ అభిమానులు నా వెన్నంటే వున్నార‌ని, త‌న‌కు ధైర్యాన్నిచ్చార‌ని, ఆ ప్రేమే త‌న జీవితం ప్ర‌శాంతంగా మారేలా చేసింద‌ని, దాన్ని తాను ఎప్పుడూ మ‌ర్చిపోన‌ని వెల్ల‌డించార‌ట‌. ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో శింబు `మానాడు` పేరుతో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All