Homeటాప్ స్టోరీస్సుదీప్ కంటే అరవింద్ స్వామి బెస్ట్ అంటున్నశింబు

సుదీప్ కంటే అరవింద్ స్వామి బెస్ట్ అంటున్నశింబు

సుదీప్ కంటే అరవింద్ స్వామి బెస్ట్ అంటున్నశింబు
సుదీప్ కంటే అరవింద్ స్వామి బెస్ట్ అంటున్నశింబు

సినిమాలో హీరో కంటే విలన్ ముఖ్యం. కొన్నిసార్లు హీరోయిన్ మైనస్ అయినా ప్రేక్షకులు పట్టించుకోరు, కానీ విలన్ క్యారక్టర్ వీక్ అయితే సినిమా కి దెబ్బ పడుతుంది. కాబట్టి ఈ మధ్య విలన్ క్యారెక్టర్లు హీరోల ఇమేజ్ కి సరిసమానంగా ఉంటున్నాయి. అసలు హీరో క్యారెక్టర్ ఎలివేట్ చెయ్యడానికి బలమైన విలన్ ను డిజైన్ చెయ్యడం ఒక సవాల్ ప్రస్తుత మేకర్స్ కి. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా, హీరో ఫ్యాన్స్ కి నచ్చదు. ఇది ఒకరకంగా కట్టి మీద సాము లాంటి పని.

ప్రస్తుతం తమిళ హీరో శింబు తాజా సినిమాలో కూడా మొదట విలన్ గా అనుకున్న కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ స్థానంలో తమిళ్ అందాల నటుడు ప్రస్తుతం విలన్ గా బిజీ అవుతున్న అరవింద్ స్వామిని ఖరారు చేసారు. ఎంత హీరోగా శింబు ఎలివేట్ అయినా, పతాక సన్నివేశాల్లో సుదీప్ స్థాయి నటుడు శింబు ని డామినేట్ చేస్తాడని భావించాడో ఏమో.? సదరు సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు విలన్ గా అరవింద్ స్వామిని ఫైనల్ చేసాడు. అరవింద్ అయితే తనదైన కూల్ & సటిల్ యాక్టింగ్ తో సినిమా కి హెల్ప్ అవ్వచ్చు.

- Advertisement -

ఇక “తనీ ఒరువన్” సినిమాతో మొదలుపెడితే ఇటీవల మణిరత్నం గారి “సెక్క సివండ వనం” సినిమాలో వరదా భాయ్ వరకూ అరవింద్ స్వామీ ఆదరగొట్టేసాడు. ఇక సుదీప్ అయితే రాజమౌళి ఈగ సినిమాతో మొదలుకొని ఇటీవలే వచ్చిన సల్మాన్ ఖాన్ “దబాంగ్ 3” హీరోకి గట్టి కాంపిటీషన్ ఇచ్చే విలన్ గా తనదైన మార్క్ చూపించాడు. అసలే శింబు కి ఈమధ్య సోలోగా సరైన హిట్ సినిమా రాలేదు. ఈ సినిమా తనకు ఎంతో కీలకం. అజిత్ తో “మంగాత్త” లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వెంకట్ ప్రభు శింబు లాంటి విలక్షణ నటుడిని ఎలా ప్రజెంట్ చేస్తాడో.? అని కోలీవుడ్ వర్గాలో భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All