Homeటాప్ స్టోరీస్మ‌రోసారి దానికి సిద్ధంగా లేను!

మ‌రోసారి దానికి సిద్ధంగా లేను!

మ‌రోసారి దానికి సిద్ధంగా లేను!
మ‌రోసారి దానికి సిద్ధంగా లేను!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో న‌టించిన `కాట‌మ‌రాయుడు` మూవీ త‌రువాత తెలుగు చిత్రాల‌కు బ్రేకిచ్చింది శృతిహాస‌న్‌. దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది. శృతి న‌టిస్తున్న తాజా చిత్రం `క్రాక్‌`. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తున్న ఈ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో పాటు త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తూ నిర్మిస్తున్న `లాభం` చిత్రంలోనూ న‌టిస్తోంది.

ఇటీవ‌ల ఈ మూవీ లొకేష‌న్ నుంచి అర్థాంత‌రంగా వెళ్లిపోయి శృతిహాస‌న్ యూనిట్ స‌భ్యుల‌కు షాకిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల‌పై తాజాగా శృతిహాస‌న్ స్పందించింది. `క‌రోనా నుంచి కాపాడుకోవ‌డం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త. లాక్‌డౌన్ త‌రువాత షూటింగ్ ప్రారంభించిన స‌మ‌యంలో అన్ని జాగ్ర‌త్త‌లు పాటించేవాళ్లం. కానీ రాను ‌రాను ప్ర‌జ‌లు క‌రోనాను సాధార‌ణంగా తీసుకోవ‌డం ప్రారంభించారు. కోవిడ్ -19 అంటే జ‌లుబు కాదు. అది తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల్ని సృష్టిస్తుంది. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రి జాగ్ర‌త్త‌లు వారు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది` అని శృతిహాస‌న్ స్ప‌ష్టం చేసింది.

- Advertisement -

కొంత మంది మాస్క్ కూడా ధ‌రించ‌రు. అలాంటి వాళ్ల‌ని చూస్తే కోపం వ‌స్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇప్ప‌టికే ఒక‌‌సారి బ్రేక్ తీసుకున్నా. మ‌రోసారి అందుకు సిద్ధంగా లేను. ఒంట‌రిగా జీవించ‌డం వ‌ల్ల ఈ ఏడాది ఎన్నో విష‌యాలు నేర్చుకున్నా. జీవితం ప‌ట్ల క్లారిటీ వ‌చ్చింది. మ్యూజిక్ కోసం ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించ‌గ‌లిగాను. వ‌చ్చే ఏడాది ఇలాగే ఒంట‌రిగా వుండాల‌నుకుంటున్నాను` అని తెలిపింది శృతి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All