Homeగాసిప్స్బాలయ్యతో నో అన్న శృతి ఇప్పుడెందుకు ఎస్ అంది?

బాలయ్యతో నో అన్న శృతి ఇప్పుడెందుకు ఎస్ అంది?

బాలయ్యతో నో అన్న శృతి ఇప్పుడెందుకు ఎస్ అంది?
బాలయ్యతో నో అన్న శృతి ఇప్పుడెందుకు ఎస్ అంది?

గోపీచంద్ మలినేని క్రాక్ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను సాధించాడు. ఈ చిత్ర విజయం తర్వాత నందమూరి బాలకృష్ణతో పనిచేసే అవకాశం గోపీచంద్ కు దక్కింది. వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని నెలల క్రితం సినిమా అనౌన్స్ కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కాస్ట్ అండ్ క్రూ ను ఫైనల్ చేస్తున్నాడు గోపీచంద్. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట శృతి హాసన్ ను అప్రోచ్ అయ్యాడు దర్శకుడు. శృతితో గోపీచంద్ మలినేనికు మంచి స్నేహం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బలుపు, క్రాక్ మంచి విజయాలు సాధించాయి. ఈ స్నేహంతోనే బాలయ్య సినిమాకు కూడా హీరోయిన్ గా అడిగాడు.

- Advertisement -

అయితే సీనియర్ హీరో సరసన చేయడం ఇష్టం లేదని సున్నితంగా ఆ ఆఫర్ ను వద్దనుకుంది శృతి. ఆ తర్వాత గోపీచంద్ చాలా మంది హీరోయిన్లను అప్రోచ్ అవ్వగా వివిధ కారణాల వల్ల వర్కౌట్ కాలేదు. మరోసారి శృతి హాసన్ వద్దకు ఈ స్క్రిప్ట్ వెళ్లిందని, అయితే ఈసారి మాత్రం శృతి ఎస్ చెప్పనట్లు వార్తలు వస్తున్నాయి. ముందు నో చెప్పగా, ఇప్పుడెలా యాక్సెప్ట్ చేసిందన్నది ఆశ్చర్యంగా ఉంది. స్నేహమో, రెమ్యునరేషనో, మరొకటో కారణం కానీ శృతిను కన్విన్స్ చేయగలిగాడు దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All