క్రేజీ కథానాయకగా పేరుతెచ్చకున్న శ్రియ ఇటీవల బోయ్ ఫ్రెండ్ రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రూ కోచ్లిన్ వివాహం చేసుకుని సినిమాలు తగ్గించుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం `ఎన్టీఆర్ కథానాయకుడు`. ఈ సినిమా తరువాత శ్రియ తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళంలో సినిమాలు చేస్తోంది. ఆమె నటిస్తున్న తాజా తమిళ చిత్రం `సండక్కారి`. మాదేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో వుంది.
హాలీవుడ్ ఫిల్మ్ `ది ప్రపోజల్` ఆధారంగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. శ్రియ సరన్, విమల్ పాల్గొనగా లండన్లో స్టాన్స్టెడ్ ఏయిర్ పోర్ట్ లో కీలక ఘట్టాల్నీ షూట్ చేయాలని దర్శకుడు మాదేష్ ప్లాన్ చేశారు. అంతా ఏరియర్ పోర్ట్కి వెళ్లారు. షూటింగ్ ప్రారంభించారు. హెవీ క్రౌడ్ వున్న ఏయిర్ పోర్ట్లో శ్రియ తన వ్యక్తిగత సెక్యూరితో ఎంట్రీ ఇచ్చింది. తన చుట్టూ సెక్యురిటీ వుండటంతో అనుమానించిన లండన్ పోలీసులు శ్రియపై అనుమానంతో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారట. ప్రాపర్ పర్మీషన్ లేకుండా ఇలా ఎలా ఎంటరయ్యారని ప్రశ్నించడంతో యూనిట్ సభ్యులంతా అవాక్కయ్యారట.
శ్రియ మాత్రం తననని ప్రశ్నించిన పోలీసులకు ధీటుగా సమాధానం చెప్పి హడలెత్తించేసిందట. షూటింగ్ కోసం పర్మీషన్ తీసుకున్న డాక్యుమెంట్స్ని చూపించి హల్చల్ చేసేసిందట. దీంతో లండన్ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారని, యూనిట్ అంతా ఊపిరి పీల్చుకుని యధవిధిగా షూటింగ్ కంటిన్యూ చేశారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అన్నట్టు శ్రియ త్వరలో తెలుగులో సెట్స్పైకి రాబోతున్న `అసురన్` రీమేక్లో నటించనుందని తెలిసింది. వెంకటేష్కు జోడీగా శ్రియ ఈ చిత్రంలో కనిపించనుందని, ఇప్పటికే చిత్ర వర్గాలు ఆమెతో సంప్రదింపులు జరిపాయని, శ్రియ కూడా వెంకీలో కలిసి నటించడానికి ఓకే చెప్పేసిందని చిత్ర వర్గాల సమాచారం.