Homeటాప్ స్టోరీస్నిర్లక్ష్యానికి పరాకాష్ట.. చిరంజీవి ఫొటోతో శ్రద్ధాంజలి ఘటించింది

నిర్లక్ష్యానికి పరాకాష్ట.. చిరంజీవి ఫొటోతో శ్రద్ధాంజలి ఘటించింది

నిర్లక్ష్యానికి పరాకాష్ట.. చిరంజీవి ఫొటోతో శ్రద్ధాంజలి ఘటించింది
నిర్లక్ష్యానికి పరాకాష్ట.. చిరంజీవి ఫొటోతో శ్రద్ధాంజలి ఘటించింది

నిన్న కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన చిరంజీవి సర్జా అనే యువ నటుడు మరణించారు. అక్కడ దాదాపు 20 సినిమాలకు పనిచేసిన చిరంజీవి సర్జా, సీనియర్ నటుడు అర్జున్ సర్జాకు మేనల్లుడు కూడా. నిన్న అనుకోకుండా గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. దీనిపై తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ఇంత చిన్న వయసులో చిరంజీవి సర్జా దుర్మరణం పాలవ్వడం దారుణమని అందరూ అన్నారు. ఇదిలా ఉంటే సౌత్ లో నటించే నటుల పట్ల ఉత్తరాది వారికి ఎంత చిన్న చూపో తెలిపే మరో ఘటన ఈ సందర్భంగా వెలుగు చూసింది.

నార్త్ లో ప్రముఖ జర్నలిస్ట్, కాలమిస్ట్ శోభా డే, మరో ధ్రువ తార నేలరాలింది. ఇది చాలా విషాదకర సంఘటన అంటూ ట్వీట్ చేసింది. అంత వరకూ బాగానే ఉంది కానీ చిరంజీవి సర్జా ఫొటోకు బదులు, మెగాస్టార్ చిరంజీవి ఫోటోను ఈ ట్వీట్ జత చేసింది. అంటే మరణించింది ఎవరో కూడా తెలుసుకోకుండా ట్వీట్ చేసేసిందన్నమాట. దీనిపై ఇప్పుడు మెగాస్టార్ అభిమానులే కాక, సౌత్ లోని ప్రముఖులు కూడా ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

ఎందుకు ఎప్పుడూ సౌత్ ఇండస్ట్రీ అంటే అంత చిన్న చూపు, ఒక చిన్న గూగుల్ సెర్చ్ తో అసలు విషయం తెలుస్తుంది కదా. అంత తీరిక కూడా లేకుండా ఇలాంటి ట్వీట్స్ వల్ల ఎంతోమందికి మానసిక వేదన కలుగుతుంది అని స్పందించారు. శోభా డే ఈ విషయంలో త్వరగానే స్పందించి ట్వీట్ డిలీట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All