Homeటాప్ స్టోరీస్తెలంగాణ‌ సీఎం స‌హాయ‌నిధికి రాజ‌శేఖ‌ర్ కుమార్తెల విరాళం!

తెలంగాణ‌ సీఎం స‌హాయ‌నిధికి రాజ‌శేఖ‌ర్ కుమార్తెల విరాళం!

తెలంగాణ‌ సీఎం స‌హాయ‌నిధికి రాజ‌శేఖ‌ర్ కుమార్తెల విరాళం!
తెలంగాణ‌ సీఎం స‌హాయ‌నిధికి రాజ‌శేఖ‌ర్ కుమార్తెల విరాళం!

క‌రోనా క్రైసిస్ కార‌ణంగా చాలా మంది సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది తిండి కూడా దొర‌క‌క్క ఇబ్బంది ప‌డుతున్నారు. వారిని కాపాడ‌టం కోసం సీఎం స‌హాయ నిధికి చాలా మంది విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. డా. రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు శివాని, శివాత్మిక 2 ల‌క్ష‌లు విరాళం అందించారు.

యాంగ్రీ యంగ్‌మెన్ డా. రాజ‌శేఖ‌ర్ చిన్న కుమార్తె, `దొర‌సాని` చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన శివాత్మిక పుట్టిన రోజు నేడు (ఏప్రిల్ 22). ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని శివాత్మిక తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి ల‌క్ష రూపాయ‌లు విరాళంగా అందించారు. అలాగే రాజ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె శివాని మ‌రో అక్ష విరాళాన్ని అందించారు.

- Advertisement -

ఈ ఇద్క‌ద‌రు అక్కా చెల్లెళ్లు బుధ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కి వెళ్లి ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌కు చెక్కుల్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌తో స‌మావేశ‌మైన శివాని, శివాత్మిక క‌రోనా నియంత్ర‌ణ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల్ని కొనియాడారు. మా వంతు స‌హాయం చేయాల‌ని ముందు కొచ్చామ‌ని, ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అంతా పాటించి ఇంటి ప‌ట్టునే వుండాల‌ని ఈ సంద‌ర్భంగా శివాని, శివాత్మిక ప్ర‌జ‌ల‌కి సూచించారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All