పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది . నన్ను ప్రేమించానని మోసం చేసాడు , నన్ను ప్రేమలో పూర్తిగా ముంచేసి నన్ను పూర్తిగా వాడుకొని మరొకరిని పెళ్లి చేసుకున్నాడు అతడు చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాను కానీ నిజమైన ప్రేమ త్యాగం ని కోరుతుంది కాబట్టి అతడ్ని క్షమించి వదిలేసానని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు చెప్పింది శిల్పా శెట్టి .
1992 లో విడుదలైన కిలాడీ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన నటించింది శిల్పా శెట్టి . ఆ సినిమా షూటింగ్ జరుగుతన్న సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు అయితే ఆ ప్రేమ ఎక్కువ కాలం కొనసాగలేదు . శిల్పా శెట్టి అక్షయ్ ని గుడ్డిగా ప్రేమించిందట కానీ అక్షయ్ మాత్రం శిల్పా శెట్టి ని వాడుకున్న తర్వాత మొహం చాటేసాడట దాంతో ఆమె మనసు ముక్కలైందట ! ఆ ఆవేశంలో అక్షయ్ ని ఏదో చేయాలనీ అనుకుందట కానీ నేను నిజంగా ప్రేమించాను కాబట్టి అతడ్ని క్షమించానని అంటోంది . అక్షయ్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ని పెళ్లి చేసుకోగా శిల్పా శెట్టి రాజ్ కుంద్రా ని పెళ్లి చేసుకుంది .