అల్లు అర్జున్ కథానాయకుడిగా కొత్త బాట పట్టించిన దర్శకుడు సుకుమార్. వీరిద్దరి కలయికలో ఇప్పటి వరకు ఆర్య, ఆర్య2 వంటి చిత్రాలొచ్చాయి. ఈ రెండింటిలో ఒకటి సూపర్హిట్గా నిలిస్తే `ఆర్య2` యావరేట్ హిట్గా నిలిచింది. ఈ సినిమా తరువాత వీరిద్దరి కలయికలో ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. కొంత విరామం తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించబోతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. `రంగస్థలం` వంటి బ్లాక్ బస్టర్ తరువాత మళ్లీ మైత్రీ మూవీమేకర్స్లో సుకుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సారి చాలా కొత్త కథతో `రంగస్థలం` తరహాలోనే మళ్లీ మెస్మరైజ్ చేయబోతున్నారని తెలిసింది. నల్లమల నేపథ్యంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బన్నీ ఊరమాస్ పాత్రలో లారీ డ్రైవర్గా కనిపిస్తారని, ఆయన గెటప్, మేనరిజమ్స్ కొత్తగా వుంటాయని వినిపిస్తోంది.
తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్సేతుపతి ఇదులో విలన్గా నటిస్తున్నారు. ఇందులో కోసం ఆయన ఏకంగా భారీ మొత్తాన్నే డిమాండ్ చేశారని, ఈ చిత్రానికి `శేషాచలం` అనే టైటిల్ని చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన మేకర్స్ బన్నీ చిత్రానికి ప్రచారంలో వున్న టైటిల్ నిజం కాదని, అది కొంత మంది ప్రారం చేస్తున్న రూమర్ మాత్రమేని, టైటిల్ని ఇంకా ఖరారు చేయలేదని, టైటిల్ ఖరారు కాగానే అధికారికంగా వెల్లడిస్తామని చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. `అల వైకుంఠపురములో` తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న 20వ చిత్రమిది.
Title for Stylish Star @alluarjun‘s #AA20 with Sukumar Garu is not yet finalized…
Reports that are appearing in some web sites regarding the title are all false and there is no truth in the same. The title will be announced at an appropriate time later.
Thank you!
— Mythri Movie Makers (@MythriOfficial) January 20, 2020
Credit: Twitter