Homeటాప్ స్టోరీస్అరుదైన రికార్డును సాధించిన షేర్షా

అరుదైన రికార్డును సాధించిన షేర్షా

అరుదైన రికార్డును సాధించిన షేర్షా
అరుదైన రికార్డును సాధించిన షేర్షా

గత కొంత కాలం నుండి వార్తల్లో నిలుస్తూ వస్తోన్న బాలీవుడ్ చిత్రం షేర్షా ఇప్పుడు ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ఈ చిత్రం కార్గిల్ హీరో, పరమవీర చక్ర గ్రహీత విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ అయింది.

ఈ చిత్రానికి విడుదలైన రోజు నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ సినిమా రేటింగ్ సంస్థ ఐఎండిబిలో 8.9 రేటింగ్ సాధించి బాలీవుడ్ హయ్యస్ట్ రేటెడ్ సినిమాగా గౌరవం దక్కించుకుంది. ఏకంగా 200 దేశాల్లో ఈ సినిమాను చూసినట్లుగా అధికారిక లెక్కలు ఉన్నాయి. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అమెజాన్ ప్రైమ్ లో ఎక్కువగా చూసిన సినిమాగా షేర్షా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

- Advertisement -

సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ డైరెక్ట్ చేసాడు. ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All