యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 14న తన అపార్టుమెంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బాలీవుడ్ తో పాటువ్యావత్ సినీలోకం షాక్ కు గురైంది. హీరోగా బిజీగా మారుతున్న వేళ సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం పలువురిని భయాందోళనకు గురిచేస్తోంది.
సుశాంత్ ఆత్మ హత్య పై పలువురు అనుమానం వ్యక్తం చేస్తుంటే సుశాంత్ మేన మామ సిబిఐ దర్యాప్తు కోరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దర్శకుడు శేఖర్ కపూర్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది.
‘నీ జీవితంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నిన్ను చెడ్డ వాడిగా చిత్రించి నిన్ను కిందికి లాగాలన్న వారి కథలు తెలుసు. వారివలన నా భుజంపై ముఖం వాల్చి ఏడ్చావు. ఆరు నెలలుగా నేను నీతో వుండాల్సింది. ఎం జరిగినా అది వారి ఖర్మ’ అంటూ శేఖర్ కపూర్ చేసిన ట్వీట్ బోవుడ్ తో పాటు యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆరు నెలలుగా సుశాంత్ ని వేధించింది ఎవరు? అన్నది కీలకంగా మారింది.
- Advertisement -