Homeటాప్ స్టోరీస్శర్వానంద్ - కిషోర్ తిరుమల సినిమా కన్ఫర్మ్ చేసేసారుగా

శర్వానంద్ – కిషోర్ తిరుమల సినిమా కన్ఫర్మ్ చేసేసారుగా

శర్వానంద్ - కిషోర్ తిరుమల సినిమా కన్ఫర్మ్ చేసేసారుగా
శర్వానంద్ – కిషోర్ తిరుమల సినిమా కన్ఫర్మ్ చేసేసారుగా

హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా శర్వానంద్ తన సినిమాల విషయంలో స్పీడ్ చూపిస్తున్నాడు. శర్వానంద్ నటించిన రీసెంట్ సినిమాలు అన్నీ దాదాపు ఫెయిలయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన పడి పడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాలని చవిచూశాయి. తన ఇమేజ్ కు సరిపడని కథలు చేసానని గ్రహించిన శర్వానంద్ కథల ఎంపికలో జాగ్రత్తలు వహించాడు. శర్వానంద్ కు వచ్చిన హిట్లలో మేజర్ వి లైట్ హార్ట్డ్ ఎంటర్టైనెర్స్. సో ఆ జోనర్ లో మళ్ళీ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు.

ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించారు. ముందు నుండీ అనుకున్నట్లుగానే శర్వానంద్, దర్శకుడు కిషోర్ తిరుమలతో జత కట్టనున్నాడు. కిషోర్ తిరుమల మొదటి నుండి కామెడీ కలగలిసిన రొమాంటిక్ ఎంటెర్టైనెర్స్ తీయడంలో దిట్ట. గతేడాది సాయి ధరమ్ తేజ్ తో చిత్రలహరి చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టిన కిషోర్ తిరుమల ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో రెడ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ చివర్లో ఉంది. ఇంకా ఒక్క పాటను చిత్రీకరించాల్సి ఉంది. అది కూడా పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా కానిచ్చేసి ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.

- Advertisement -

శర్వానంద్ – కిషోర్ తిరుమల చేయబోయే చిత్రంలో సాయి పల్లవిని కథానాయికగా అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి పడి పడి లేచే మనసు చిత్రానికి పనిచేసిన సంగతి తెల్సిందే. అదే చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రస్తుత సినిమాను నిర్మించనున్నాడు. వేసవి నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది. ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది మొదట్లో కానీ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All