HomeUncategorizedకొరియోగ్రాఫర్ రాజు సుందరం డైరెక్షన్లో శర్వానంద్ ..?

కొరియోగ్రాఫర్ రాజు సుందరం డైరెక్షన్లో శర్వానంద్ ..?

కొరియోగ్రాఫర్ రాజు సుందరం డైరెక్షన్లో శర్వానంద్ ..?
కొరియోగ్రాఫర్ రాజు సుందరం డైరెక్షన్లో శర్వానంద్ ..?

మొదటి నుండి విభిన్న కథలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్..తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. రాజు చెప్పిన కథాంశం శర్వానంద్ ను ఎంతగానో మెప్పించిందని.. దాంతో అతడితోనే నెక్స్ట్ మూవీని చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇదివరకు ఎందరో స్టార్ హీరోల సినిమాలకి డ్యాన్స్ కొరియో గ్రాఫర్ గా పనిచేసిన రాజు సుందరం కొంతకాలంగా డైరెక్షన్ ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నాడు.

వాస్తవానికి అజిత్ తో రాజు సుందరం తెరకెక్కించిన తొలి చిత్రం ఫ్లాప్ అవడంతో తదుపరి అవకాశాలు రాలేదు. తెలుగు లో మహేష్ తో సినిమా చేయాలనీ సుందరం గట్టిగానే ట్రై చేసాడు కానీ వర్క్ అవుట్ కాలేదు. ఈ తరుణంలో శర్వా కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. త్వరలోనే ఈ మూవీ కి సంబదించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 25న విడుదల కావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ కారణంగా వాయిదా పడింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్స్ రాధిక, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All